పాలిటెక్నిక్‌ కళాశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామబాద్‌ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగ అప్‌ గ్రేడ్‌ చేయాలని పి.డి.యస్‌.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్‌ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్‌.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగా అప్గ్రేట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్యూ విద్యార్థు సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఆందోళనలు చేయడం జరిగిందని తెలిపారు.

కానీ ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ కళాశాల గా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నామని జీవో జారీ చేయకపోవడం అన్యాయమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా నిజామాబాద్‌ జిల్లాకు ఇంజనీరింగ్‌ కళాశాల కావాలని ఏ ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడగకపోవడం, స్థబ్దంగా ఉండడం బాధాకరమన్నారు. వెంటనే నిజామాబాద్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగా అప్‌ గ్రేడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పి.డి.యస్‌.యు. నగర నాయకులు నసీర్‌, నాగేష్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, తరుణ్‌, అఖిల్‌,ఆశిష్‌, నిఖిల్‌ లతో కళాశాల కమిటీ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »