తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి..

హైదరాబాద్‌, జనవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ఉత్తరద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో శ్రీ సీతారామ చంద్రుల వారు, లక్ష్మణుడు, హనుమంతుడి సమేతంగా హంసవాహనంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాములవారిని దర్శించుకున్నారు.

Check Also

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »