అతివేగం ప్రమాదాలకు కారణం…

లింగంపేట్‌, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం లింగం పేట్‌ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్త దాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు.

ఆభద్రతాభావంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి, కొన్ని సమయాల్లో ప్రాణాపాయం కలుగుతుందని తెలిపారు. లింగంపేట్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని తెలిపారు. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దలనీ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా దాతలు 200 హెల్మెట్‌ లు పంపిణీ చేయడం జరుగుతున్నదని, వాటిని తప్పని సరిగా ధరించి వాహనాలు నడుపాలని తెలిపారు. పోలీసు వారి సహకారంతో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.

అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపే విధంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. అతివేగం, రాష్‌ గా వెళ్ళడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, సగటున దేశంలో 1.70 లక్షల మంది, రాష్ట్రంలో 6000మంది, కామారెడ్డి జిల్లాలో 270 మంది ప్రమాదాల వలన మరణిస్తున్నారని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు కారణమని అన్నారు. ప్రతీ వాహన చోదకులు హెల్మెట్‌ ధరించాలని, షీట్‌ బెల్ట్‌ ధరించాలని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయకూడదని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్‌, హెల్మెట్‌ లను పంపిణీ చేసారు.

కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న, అడ్వకేట్‌ మొయిన్‌ అహ్మద్‌ ఖాద్రి, డిఎస్పీ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »