ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ వివరాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రూపొందించిన వివరాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. చందూర్‌, అక్బర్‌ నగర్‌, రుద్రూర్‌ గ్రామాలను కలెక్టర్‌ సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయ్యి, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని, క్రాప్‌ బుకింగ్‌, భువన్‌ యాప్‌ల సహాయంతో వెరిఫికేషన్‌ చేయాలన్నారు. అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి, గ్రామ సభల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, చందూర్‌ ఎంపీడీఓ నీలావతి, తహసీల్దార్‌ శాంతా, ఇతర అధికారులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »