సంతాయిపేట్‌ గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) అన్నారు. గురువారం కామారెడ్డి మండలం నర్శన్నపల్లి, తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

గత ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాలు అమలు కొరకు గ్రామసభలో జాబితాలను చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి వాటిలో అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయాలని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »