Breaking News

ఉపాధి పనులలో కూలీల సంఖ్య పెంచాలి…

కామారెడ్డి, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రామాలలో చేపట్టే ఉపాధిహామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ప్రాపర్టీ పన్ను, త్రాగునీరు, సి.సి.చార్జీలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ కూలీ కి పనులు కల్పించాలని అన్నారు.

వాటర్‌ సోర్స్‌ లను ముందే ఏర్పాటు చేసుకోవాలని, అవసరం మేరకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలనీ సూచించారు. పెండిరగులో ఉన్న సి. సి. చార్జీలు చెల్లింపులు చేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణ లో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. గత మూడు, నాలుగు నెలల నుండి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారని తెలుపుచు, ఇదే స్ఫూర్తితో మున్ముందు పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి,అదనపు కలెక్టర్లు వి.విక్టర్‌, శ్రీనివాస్‌ రెడ్డి , ఆర్డిఓలు రంగనాథ్‌ రావు, ప్రభాకర్‌, జడ్పీ సీఈవో చందర్‌, సి.పి.ఒ. రాజారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ దయానంద్‌,జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఎ.పి.ఒ. లు ,తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌.18, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »