ఆహారకల్తీ మహమ్మారిపై చైతన్య సదస్సు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధంల ఆద్వర్యంలో ఆర్మూర్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్‌ ఉప్పులో ప్లాస్టిక్‌ అంశముపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు.

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒక వేళ ప్యాకింగ్‌ లో చేస్తే, ఆ ప్లాస్టిక్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రమాణాలు ప్యాకింగ్‌ పై ముద్రించాలని తెలిపారు. కాని వివిధ రకాల అయోడిన్‌ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్‌ కవర్‌ లలో ఉప్పు ప్యాకింగ్‌ చేసి, చిన్న పిల్లలతో సహా అందరికీ క్యాన్సర్‌ రావడానికి కారణం అవుతున్నారని సాంబరాజు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, ఉపాధ్యక్షుడు వి.యన్‌.వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్‌, ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షులు పౌడపల్లి అనిల్‌,రూరల్‌ ఇంచార్జీ కార్యదర్శులు యాటకర్ల దేవేష్‌, అంగన్వాడీ సూపర్వైజర్లు నళిని, వెన్నెల వెంకట రమణమ్మ, అంగన్వాడి టీచర్‌, అంగన్వాడి వెల్పర్స్‌, విద్యార్థిని విద్యార్థులు బాలింతలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొని వంట నూనెలు, కందిపప్పు, ఫోర్టిఫైడ్‌ బియ్యం నిల్వలలో జాగ్రత్తల పై నేడు ఆర్మూర్‌ లోని అయిదు సెంటర్లు హుస్నాబాద్‌ గల్లీలో రెండు, జర్నలిస్టు కాలని, మగ్దూమ్‌ నగర్‌, లలో అంగన్వాడీ కార్యకర్తలను చైతన్య వంతులను చేశారు.

Check Also

‘ఆపద మిత్ర’ వాలంటీర్లకు ముగిసిన శిక్షణ

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »