వెలమ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా, లోయపల్లి అనిత – నర్సింగ్‌ రావు పద్మనాయక వెలమ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వెలమ కులస్తులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండ్ర మధుసూదన్‌ రావు, ఉపాధ్యక్షులుగా గౌరనేని మధుసూదన్‌ రావు, జలగం సుజాత రావు, ప్రధాన కార్యదర్శిగా రాజాగంభీర్‌ రావు, కోశాధికారిగా రాజేశ్వరరావును, కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌ రావు, గడీల బాబురావు, ఐలేని రవీందర్రావు, సంజీవరావు, దామోదర్‌ రావు ఇతర ముఖ్య వెలమ కులస్తులు, వివిధ గ్రామాల నుండి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

లోయపల్లి నర్సింగ్‌ రావు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన కామారెడ్డి వెలమ అసోసియేషన్‌ సభ్యులకు, కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజాగంభీర్‌ రావు మాట్లాడుతూ వెలమ బంధువులంతా ఒక తాటిపై ఉండాలని, వెలుమలో నిరుపేద కుటుంబాలకు, కామారెడ్డి వెలమ అసోసియేషన్‌ నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వెలమ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »