ఎన్నికల పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్‌ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్‌ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు.

జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్‌ స్టాఫ్‌ కలుపుకుని 6064 ప్రిసైడిరగ్‌ అధికారులు, 8160 మంది ఓ.పీ.ఓ ల ర్యాండమైజేషన్‌ జరిపారు. మాస్టర్‌ ట్రైనర్స్‌ చే వీరికి పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, డీపీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »