నిజామాబాద్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం మెండోరా మండలం పోచంపాడ్ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు.
స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా పాలనాథికారి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను పరిశీలించారు. 25 ఎకరాల స్థలం అవసరం ఉన్నందున, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని మెండోరా తహసీల్దార్ సి. సంతోష్ రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్.ఐ వేణుగోపాల్, సర్వేయర్ మమత, సంబంధిత అధికారులు ఉన్నారు.