కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్ స్కూల్స్కి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. నాగరానీ, కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ సెక్రెటరీ విచ్చేసి పొక్సో చట్టం, స్కూల్లో టీచర్ యొక్క బాధ్యతలను వివరిస్తూ, స్కూల్స్లలో ఇటువంటి సంఘటనలు ఎదురైతే రిపోర్ట్ చేయాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కోర్టులలో ఫ్రెండ్లీ ప్రొసిజర్స్ ఫాలో అవడం జరుగుతుందని వివరించారు.
చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కి బ్యాడ్జెస్ ప్రధానం చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో మొదటిసారిగా ప్రొటేక్షన్ ఆఫీసర్లను మన కామారెడ్డి జిల్లాలోనే నియమించడం జరిగిందని వారు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సోనీకుట్టి జార్జ్, చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, యునిసెఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎ. ప్రమీల జిల్లా సంక్షేమ అధికారి, డబ్ల్యుడి అండ్ సిడబ్ల్యు డిపార్ట్మెంట్, కామారెడ్డి జిల్లా డాక్టర్ జె. స్రవంతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కామారెడ్డి డి.స్వర్ణలత, సభ్యురాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కామారెడ్డి జిల్లా బాల్ రక్షాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.