జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రశ్నించే పీ.డీ.ఎస్‌.యూ. (పిడిఎస్‌యు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌,డాక్టర్‌ కర్క గణేష్‌,జిల్లా కోశాధికారి నిఖిల్‌, సిపిఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ ఆర్మూర్‌ ఏరియా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి కిషన్‌ లను ముందస్తు అరెస్టు చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ చెందిన పిసిసి అధ్యక్షులు, పార్టీ సలహాదారులు,మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లా విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ సంబంధించిన అధికారాలు చూస్తున్నా గానీ ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్‌, స్కాలర్షిప్లు, మెస్‌ బకాయలు చెల్లించకపోవడం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటున్నారు. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇటువంటి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.

Check Also

పెంచిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఫీజును తగ్గించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »