పీ.హెచ్‌.సీని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మండల కేంద్రమైన మాక్లూర్‌ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి పీ.హెచ్‌.సీ నిర్వహణ తీరును గమనించారు. అన్ని రకాల ఔషధాలు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీశారు.

అనంతరం కలెక్టర్‌ ఎలియాతండాలో గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. కొత్త బియ్యం కేటాయించడం వల్ల అన్నం కాస్తంత మెత్తగా అవుతోందని నిర్వాహకులు తెలుపగా, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను కలెక్టర్‌ తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని ఆదేశించారు.

స్టోర్‌ రూమ్‌లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట నూనె ప్యాకెట్లు, పసుపు, కారంపొడి ప్యాకెట్లను, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్‌ వెంట మాక్లూర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ పద్మలత, గురుకుల పాఠశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ విద్యారాణి తదితరులు ఉన్నారు.

Check Also

ఇంటర్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »