నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్ లో గల సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో …
Read More »Monthly Archives: February 2025
సేవాలాల్ అడుగుజాడల్లో నడవాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఆర్డీఓ కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి నర్సింలు, జిల్లా గిరిజన …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఫిబ్రవరి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.38 వరకుయోగం : సుకర్మ ఉదయం 7.02 వరకుకరణం : వణిజ ఉదయం 9.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.28 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.8.07 వరకుదుర్ముహూర్తము : ఉదయం 6.31 – …
Read More »పుల్వామా అమర జవానులకు నివాళి
బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం స్వచ్ బాన్సువాడ టీం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్వచ్ఛ బాన్సువాడ టీం వ్యవస్థాపక అధ్యక్షులు మోచి గణేష్, భవాని ప్రసాద్, యూనుస్, శంకర్ గౌడ్, హన్మండ్లూ, రాజు, శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read More »వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలానుగుణ వాతావరణ పరిస్థితుల మార్పులకు అనుగుణంగా రానున్న వేసవి కాల పరిస్థితుల దృష్ట్యా సంభవించే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో జాతీయ వాతావరణ మార్పుల ఆరోగ్య సమస్యల నియంత్రణ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యలయంలో కరపత్రాలు, గోడప్రతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. …
Read More »ఆరోగ్యం.. పోషణ పట్ల మహిళలను చైతన్యం చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గల మహిళా సంఘా సభ్యులకు ఆరోగ్యం.. పిల్లల పోషణ, పరిసరాలు పరిశుభ్రత, పారిశుధ్యం, రక్తహీనత, సమతుల ఆహారం తీసుకునేలా, గర్భవతిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని ఏపిఎం, సీసీ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి దిశ …
Read More »రిటర్నింగ్ అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలు సమర్ధవంతంగా ఎన్నికల …
Read More »అభివృద్ధి పనుల వివరాలు రోజు వారీ సమర్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో శానిటేషన్, పార్క్ల నిర్వహణ, వాటరింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని పార్క్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత పార్కును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పట్టణంలో పార్కు లను అభివృద్ధి పరచాలని, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేయాలని, …
Read More »ప్రతీ శుక్రవారం వాటరింగ్ డే
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమాన్ని తప్పని సరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక కళాభారతి ముందుగల మొక్కలకు నీటిని పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ శుక్రవారం మొక్కలకు నీటిని పొయాలని, ముఖ్యంగా ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాటిన మొక్కలు, చెట్లకు నీటిని పోయాలనీ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని …
Read More »పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతి లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించబడిన హెడ్ మాస్టర్స్, టీచర్స్లకు పోక్సో చట్టంపై ఒక రోజు ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియమించబడిన ప్రొటెక్షన్ ఆఫీసర్ పాఠశాలలో పిల్లల పట్ల ఎటువంటి …
Read More »