నిజామాబాద్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 03వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.