జక్రాన్పల్లి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలోగల మెడికేర్ సర్వీసెస్లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ, డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసిన నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలోని 23 కేసులలోని గంజాయి 616 కేజీల 837 గ్రాములు, అల్పజోలం- 3, కేజీల 444 గ్రాములు. గంజాయి మరియు అల్పజోలంలను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఇన్చార్జి సింధు శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏ.సి.పి రాజ వెంకట్ రామ్ రెడ్డి, సిసిఆర్బి ఏ.సి.పి రవీందర్ రెడ్డి సభ్యుల సమక్షంలో జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ శివారులోని మెడికేర్ సర్వీసెస్ భవనమలో గంజాయి, మరియు అల్పజోలంలను కాల్చివేశారు.