కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా చెందిన మహిళకు కుట్టు మిషన్ అవసరమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్తా ను సంప్రదించడంతో వెంటనే స్పందించి మనుగుల కుమారికి కుట్టుమిషన్ను హైదరాబాద్లో అందజేశారు.
ఈ సందర్భగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ఆర్థిక స్వాలంబనతోనే సాధ్యమవుతుందని, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి మార్గాలతో ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో కూడా మహిళల అభ్యున్నతి కోసం వారికి కుట్టుమిషన్లను అందజేసిన వందనపు శైలేష్ గుప్తాను సన్మానించారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహిళా నాయకురాలు ఉప్పల శారద మాట్లాడుతూ పేద మహిళ కోసం కుట్టు మిషన్ అందజేయడం శైలేష్ గుప్తాకు ఉన్న సామాజిక బాధ్యతకు నిదర్శనమని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పల శారదకు ప్రత్యేక కృతజ్ఞతలను శైలేష్ గుప్తా తెలిపారు.