డిచ్పల్లి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ 2020 -24 బ్యాచ్ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్ కొరకు ఏప్రిల్ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించు చివరి తేదీ 26-03-2025 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో తేదీ 27-03-2025 వరకు చెల్లించ గలరని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.