జక్రాన్పల్లి, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జడ్పీహెచ్ఎస్ తొర్లికొండ, ఎంపీపీఎస్ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుందని, దీనిలో తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను డెవలప్ చేయడం జరిగిందన్నారు. ఈ విధమైన బోధన ద్వారా విద్యార్థులకు జాయ్ ఫుల్ లర్నింగ్ మెథడ్ ద్వారా కంప్యూటర్ బోధన జరుగుతుందన్నారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగా జమున, ఎంపీపీఎస్ తొర్లికొండ ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ , గంగాధర్, డాక్టర్ నరసింహారావు, సునీత, కృష్ణ, మాలతి, మర్కంటి గంగా మోహన్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గౌతమి పాల్గొన్నారు.