నిజామాబాద్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్, ఫిజిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. కాగా సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న ఒక విద్యార్ధి పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని అన్నారు.
డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీటీలు రాస్తున్న ఓ విద్యార్థి ని చీఫ్ సూపరింటెండెంట్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు.
జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 54 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దిన్ అస్లాం, కనకమహా లక్ష్మి, ముగ్గురు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ శ్రీనాథ్ కమిటీ, బల్క్ అధికారి బుద్దిరాజ్లు, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారు.
జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బోధన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధుమలాంఛ ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయ్ సాయి జూనియర్ కళాశాల, షిరిడీ సాయి జూనియర్ కళాశాల, వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.
హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 5 జూనియర్ కళాశాలలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి 18 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ, యమున బృందం 15 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.