కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 8423 మంది విద్యార్థులకు గాను 8243 మంది విద్యార్థులు హాజరు కాగా, 180 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. ఇందులో 7140 మంది విద్యార్థులు జనరల్ అభ్యర్థులకు గాను 6999 మంది హాజరు అయ్యారని, 141 మంది గైర్ హాజరు అయ్యారని, వొకేషనల్ కోర్సులో 1283 మందికి గాను 1244 మంది హాజరు కాగా 38 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని తెలిపారు. మంగళవారం జరిగిన పరీక్షలలో ఏ విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీసు క్రింద బుక్ చేయబడలేదని తెలిపారు.