కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
వేసవి కాలంలో ప్రస్తుతం అద్దెలో నడుస్తున్న హాస్టల్ లలో నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, డిప్యూటీ ఈఈ నవీన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శివ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాష్ లు పాల్గొన్నారు.