ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన….

నిజామాబాద్‌, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్‌ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్‌ గౌడ్‌, బిట్ల రవి లను నియమిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఆదివారం బార్‌ అసోసియేషన్‌ హాల్లో నియామక పత్రాలు అందజేశారు.

బార్‌ కౌన్సిల్‌కు, నిజామాబాద్‌ అసోసియేషన్‌ మధ్య సమాచార లోపంతో అడా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తిగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం వివరాలను రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సమర్పించాలని బార్‌ అసోసియేషన్‌ను కోరారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నియమ నిబంధనకనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు జిల్లా కోర్టు ఆవరణంలోని బార్‌ అసోసియేషన్‌లో నిర్వహించబడతాయని బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు పట్ల గౌరవం ఉన్నదని సభ్యులందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని కనుక న్యాయవాదులందరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్‌ కోరారు.

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు ఉన్ని పెండెం రాజు, కోశాధికారి ఎ దీపక్‌, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్‌, సీనియర్‌ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్‌, శివాజీ భోస్లె, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »