టియులో కబడ్డి పోటీలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్‌ డే 2025 స్పోర్ట్స్‌ మీట్‌ లో భాగంగా ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

మొదటి పోరులో ఎం.ఎస్సీ కెమిస్ట్రీ జట్టు అప్లైడ్‌ ఎకనామిక్స్‌ జట్టుతో తలపడగా.. .ఉత్కంఠ పోరు నడుమ 26 పాయింట్స్‌ తో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ గెలుపొందింది. అటు రెండవ పోరులో అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ విద్యార్థులు, మాస్‌ కమ్యూనికేషన్‌ విద్యార్థులపై 29 పాయింట్స్‌తో విజయం సాధించారని వర్సిటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి బాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్‌,పి ఆర్‌ ఓ డా.పున్నయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డా.బీ ఆర్‌ నేత, నరేష్‌, కబడ్డీ ఆఫిషియల్స్‌తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »