బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలోని వల్లేపు లక్ష్మి ,వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరగగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం నవవధువు వల్లెపు లక్ష్మి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి …
Read More »Daily Archives: March 25, 2025
బకాయిలు చెల్లించాలి…
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో బకాయిలను విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డివిజన్ కన్వీనర్ శంకర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విశ్రాంత …
Read More »బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్ బహిరంగ వేలం
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మేకలు గొర్రెలు, వారాంతపు సంత, రోజువారి సంతను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించగా రూ.67.77 లక్షలకు గుత్తేదారులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేకల గొర్రెల సంత రూ.46.26 లక్షలకు, రోజువారిసంత రూ.9.02 లక్షలకు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలకు …
Read More »న్యాయవాదిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి..
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న హైదరాబాదులో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని యాదగిరి అనే దుండగుడు హత్య చేయడం కిరాతకమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి …
Read More »గుండెపోటుతో సొసైటీ వైస్ చైర్మన్ మృతి
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ మంగళవారం తన స్వగ్రామమైన రాంపూర్ తండాలో వడ్లు ఆరబెడుతుండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది. అందరితో కలివిడిగా ఉండే అంబర్ సింగ్ హఠాత్తుగా మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read More »నందిపేట్ డొంకేశ్వర్ మండలాలకు కోటి నిధులు మంజూరు
నందిపేట్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయలను ఆర్మూర్ నియాజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి మంజూరు చేసారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ 15 లక్షలు, లక్కం పల్లి 10 లక్షలు, జొర్పూర్, సిద్ధాపూర్, రైతు ఫారం, మల్లారం, మాయాపూర్ గ్రామాలకు 5 లక్షల చొప్పున షాపూర్ 10 లక్షలు, …
Read More »మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడిరచారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను, వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా …
Read More »ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రబీ సీజన్లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల …
Read More »ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవంతం చేయాలి
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్.ఆర్.ఎస్. క్రింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లే అవుట్ల క్రమబద్దీకరణకు ఈ నెల 31 తో ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు …
Read More »న్యాయవాది హత్యపట్ల బార్ నిరసన
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు …
Read More »