న్యాయవాది హత్యపట్ల బార్‌ నిరసన

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు.

హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రబాపు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జగన్‌ కోరారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం దాల్చడానికి సహకరించాలని జగన్‌ కోరారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »