డిచ్పల్లి, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2020-24 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులు బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్ ) పరీక్షల కొరకు ఏప్రిల్ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 26 తో ముగిసింది.
కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల కోరిక మేరకు ఫీ చెల్లించు చివరి తేదీని 07-04-2025 వరకు100 రూపాయల అపరాధ రుసుముతో తేదీ 08-04-2025 వరకు పొడగించినారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.