స్వశక్తి సంఘాల సభ్యులకు లోన్‌ బీమా, ప్రమాద బీమా వర్తింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. గురువారం సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ తో కలిసి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమా పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత జిల్లా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.

ప్రమాద బీమా : స్వయం సహాయక సంఘం సభ్యులుగా ఉండి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే లోన్‌ బీమా క్రింద రూ. 10 లక్షల ఇన్సూరెన్సు మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా ఎవరైనా ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.10 లక్షలు, యాభై శాతం వైకల్యం సంభవించినట్లయితే రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు.

ఈ రెండు బీమా సౌకర్యాలు గత సంవత్సరం 2024 మార్చి 14 వ తేదీ నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు. ఈ బీమా పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవలి కాలంలో మరణించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలను ఆన్‌ లైన్లో నమోదు చేయడంతో పాటు చనిపోయిన సభ్యుల క్లెయిమ్‌ డాక్యుమెంట్స్‌ ను వెంటనే ఆన్లైన్‌ లో అప్లోడ్‌ చేయాలన్నారు. బీమా పథకాల ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని డీఆర్డీఓ సాయాగౌడ్‌, మెప్మా పీ.డీ రాజేందర్‌ లకు సూచించారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »