ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి…

కామారెడ్డి, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్‌ డ్యాం లోని పూడికతీత పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు.

ఈ దేవాలయం పురాతన కాలం నాటిదని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని పూజారులు, గ్రామస్తులు కలెక్టర్‌ ను కోరారు. రోడ్డు సౌకర్యం, నీరు, టాయ్‌ లెట్స్‌ ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని నర్సరీ ను పరిశీలించి, ఇంటింటికీ పంపిణీ చేసే విధంగా పండ్లు, పూలమొక్కలను పెంచాలని తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్‌ మొక్కలకు నీరు పోశారు. ప్రతీ రోజు మొక్కలకు నీరు పోయాలని తెలిపారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా గ్రామస్తులు ప్రమీల ఇంటికి భూమి పూజ చేసి, నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఆ తరువాత బ్రహ్మాజీవాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు వాటరింగ్‌ నిర్వహించారు. ఏవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహించాలని, గాప్‌లలో కొత్త మొక్కలు నాటాలని తెలిపారు.

కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, ఇన్చార్జి తహసీల్దార్‌ రేఖ, ఎంపీడీఓ సాజిద్‌, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, ఇతర మండల అధికారులు, పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »