ఢల్లీిలో పాపన్న మహారాజ్‌ నినాదం మారుమ్రోగాలి

కామారెడ్డి, మార్చ్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

దేశవ్యాప్తంగా ఉన్న గౌడులను ఒక తాటిపైకి తెచ్చి వారందరి నోట పాపన్న మహారాజ్‌ చరిత్రను ప్రచారం చేయించే బృహత్తరమైన బాధ్యత మనందరిదని తెలియజేయడం కోసమే ‘‘పాపన్న మహారాజ్‌ ఆత్మ బలిదాన దినోత్సవం’’కార్యక్రమామని జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్‌ అన్నారు. ఢల్లీిలో ఏప్రిల్‌ రెండవ తేదీన కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగే కార్యక్రమానికి భారీ ఎత్తున గౌడ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పాపన్న మహారాజ్‌ వారసులమని చెప్పేందుకు గర్వపడాలన్నారు. పాపన్న రక్తం గౌడులలో అనువణువునా ఉప్పొంగాలనీ కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న గౌడులంతా జై పాపన్న మహారాజు అనే నినదిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌడ బిడ్డలు ఆనందంతో నృత్యం చెయ్యాలన్నరు. అటువంటి రోజు కోసం ఈరోజు నుండే మొదటి అడుగు ప్రారంభించలన్నారు. పాపన్న మహారాజ్‌ మరణించలేదని, దేశవ్యాప్తంగా ఉన్న గౌడుల గుండెల్లో సజీవంగా ఉండేలా చేసే ఈ ప్రయత్నానికి గౌడ బిడ్డలందరూ సహకరించి తండోపతండాలుగా కదిలి ఢల్లీికి రావాలని జై గౌడ్‌ ఉద్యమం తరుపున పిలుపునిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తు గడువు పెంపు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »