ఎల్‌.ఆర్‌.ఎస్‌ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌.ఆర్‌.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్‌.ఆర్‌.ఎస్‌ గడువును ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ప్లాట్లను, అనధికార లే ఔట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్‌ చేసుకున్నారని కలెక్టర్‌ వెల్లడిరచారు. వివిధ కారణాల వల్ల రెగ్యులరైజేషన్‌ చేసుకోలేకపోయిన వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ రాయితీ సదుపాయం గడువును ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగించిందని అన్నారు.

అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్‌ సూచించారు.
క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని, దీనిని దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారందరు ఈ నెల 30వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని, ప్రభుత్వం పొడిగించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »