కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మంగళవారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోషణ పక్షం ఏప్రిల్ 8 నుండి ఎప్రిల్ 22 వరకు పక్షం(15) రోజులు పాటు రోజువారి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమాలను జన్ ఆంధోలన్ డ్యాష్ బోర్డులో ఎంటర్ చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి సిడిపిఓ శ్రీలత, మద్నూర్ సిడిపిఓ కళావతి, ఇతర శాఖల జిల్లా అధికారులు మరియు సూపరిండెంట్, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.