సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్‌ తాండా లో బానోత్‌ సోఫీ, వినోద్‌ ఇంట్లో కలెక్టర్‌ తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం క్రింద పేద కుటుంబాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు.

అనంతరం ఆ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ , ఇతర అధికారులు భోజనం చేశారు. అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువు, వ్యవసాయ పనులు, రాబడి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తనకు బోర్‌ వెల్‌ మంజూరుకు సమస్య ఏర్పడిరదని సమస్య పరిష్కరించాలని బానోత్‌ వినోద్‌ కలెక్టర్‌ ను కోరారు. సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ ను కలెక్టర్‌ సూచించారు. మండలంలో రేషన్‌ కార్డుల సర్వే పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్‌ బాబు, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రేణుక చౌహాన్‌, మండల పరిషత్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌.17, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువుచైత్ర మాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »