న్యాయవాది పై దాడి నిరసనగా విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

హైదరాబాద్‌ నాంపల్లి కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది మొహమ్మద్‌ ముత్తభ అలిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మహమ్మద్‌ ముత్తబా అలి పై దుండగులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డిజిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల వృత్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం సహకరించాలని జగన్‌ కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళన కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వసంత్‌ రావ్‌, ఉపాధ్యక్షులు పెండం రాజు, సంయుక్త కార్యదర్శి దొంన్పాల్‌ సురేష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌ రెడ్డి, న్యాయవాదులు అయ్యొబ్‌, విఘ్నేష్‌, పడేగేల వెంకటేశ్వర్‌, బిట్లా రవి, శ్రీధర్‌, సీనియర్‌ జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »