నిజామాబాద్, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అథాంగ్ టోల్ ప్లాజా వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిస్బిలిటీ కింద నిజామాబాదు జిల్లా మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి 30 లక్షల విలువ చేసే అంబులెన్సు వాహనమును జిల్లా కలెక్టర్ అద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంబులెన్సు జిల్లా ప్రజలకి ఉపయోగ పడేలా వినియోగించుకోవాలని డిఎం హెచ్వోకు తెలిపారు. వీరి విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చి సిఎస్ఆర్ కింద ప్రజలకి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్, జిల్లా ఆరోగ్య శాఖా అధికారి రాజశ్రీ, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్ గేట్ మేనేజర్ అనిల్, వారి సిబ్బంది విరాజ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.