పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పి రాజేష్‌ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఎల్లారెడ్డి డీఎస్పీ, సిఐ, యస్‌ఐలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.

అనంతరంపోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్ల పరిసరాలను కేటాయించిన స్థలాన్ని సరిహద్దుగా ఉన్న పోలీస్‌ స్టేషన్ల వివరాలను పోలీస్‌ స్టేషన్‌ పరిధిని పూర్తి వివరాలను తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్‌ గస్తీ నిర్వహిస్తూ, అనుమానితులను పరిశీలిస్తూ ఉండాలని అన్నారు.

కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌ రావు, ఎల్లారెడ్డి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ రవీంద్ర నాయక్‌, సదాశివ నగర్‌ సిఐ సంతోష్‌ కుమార్‌, ఎల్లారెడ్డి ఎస్సై మహేష్‌, తాడ్వాయి ఎఎస్సై కొండల్‌ రెడ్డి పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »