నిజామాబాద్, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్మూర్ రోడ్డులోగల ఆర్.బి.వి.ఆర్.ఆర్. పాఠశాలలో శిక్షణ శిబిరం ఉంటుందని, ఉచితంగా అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు.
అర్హతలు : 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థినులు ఇందుకు అర్హులని తెలిపారు.
శిక్షణా అంశాలు :
సెల్ఫ్ డిఫెన్స్
మోటివేషన్ సెషన్లు
పోలీస్ తరగతులు – మహిళల భద్రతపై అవగాహన
పేరు నమోదు : 13-04-2025 నుండి 24-04-2025 వరకు
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు : 90009 94312
విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.