Monthly Archives: April 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్‌, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్‌ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. …

Read More »

న్యాయవాది పై దాడి నిరసనగా విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ నాంపల్లి కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది మొహమ్మద్‌ ముత్తభ అలిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మహమ్మద్‌ ముత్తబా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.20 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 10.30 వరకుయోగం : శూలం రాత్రి 10.23 వరకుకరణం : వణిజ ఉదయం 11.17 వరకుతదుపరి భద్ర రాత్రి 11.20 వరకు వర్జ్యం : రాత్రి 11.00 – 12.39దుర్ముహూర్తము : ఉదయం 8.20 …

Read More »

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్‌ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆధ్వర్యంలో పారా మోటార్‌ ఎక్స్‌ పెడిషన్‌ -2025 పేరుతో యాత్రను చేపట్టారు. దేశ రాజధాని ఢల్లీి నుండి ప్రారంభం అయిన ఈ …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొదటిరోజు గ్రామంలోని ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేశారు. అక్కడ ఉన్న నీటి కులాయిని, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో మంజీరా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రవితేజ గౌడ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డైరెక్టర్‌ శివరాం, …

Read More »

ప్రజావాణిలో ఫిర్యాదులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. సోమవారం ప్రజావాణి లో (73) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి …

Read More »

కలెక్టరేట్‌లో ఉచిత అంబలి పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం లాంచనంగా ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి …

Read More »

ప్రజావాణికి 70 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, జెడ్పీ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 11.14 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 10.00 వరకుయోగం : ధృతి రాత్రి 9.26 వరకుకరణం : తైతుల ఉదయం 11.25 వరకుతదుపరి గరజి రాత్రి 11.14 వరకు వర్జ్యం : రాత్రి 11.04 – 12.42దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.26 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »