పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌ సన్మానం

కామారెడ్డి, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి బొడ్డుపల్లి నాగ అక్షయ 600కు 586 మార్కులు సాధించారు. వీరితో పాటు బి హర్షవర్ధన్‌ 576, ఎస్‌ మృణాళిని 572, సిహెచ్‌ జాహ్నవి 562, బి.అలేఖ్య 562, పి.ఋతిక 555, బి.రామ్‌ చరణ్‌ 554, ఆర్‌ నిశాంత్‌ 554,మార్కులు సాధించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణతతో పాటు 54 మంది విద్యార్థులకు గాను 37 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించారు అని శ్రీ చైతన్య పాఠశాల ఆర్‌ఐ అన్నపూర్ణ కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సంపత్‌ కుమార్‌ డీన్‌ భీరేష్‌, పదవ తరగతి ఇంచార్జ్‌ వసంత్‌ గౌడ్‌, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నైరుతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »