నిజామాబాద్, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జన హృదయ నేత, ధర్మ పరిరక్షకులు పేదవారికి అండగా నిలబడేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ, వారు భవిష్యత్తులో ఇలాంటి అనేకమైనటువంటి జన్మదినాలు జరుపుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ సీనియర్ నాయకులు రాజకుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.