గురువారం, ఏప్రిల్.17, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 12.00 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 5.02 వరకుయోగం : వరీయాన్ రాత్రి 10.02 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.00 వరకుతదుపరి కౌలువ రాత్రి 12.35 వరకు వర్జ్యం : ఉదయం 9.08 – 10.52దుర్ముహూర్తము : ఉదయం 9.54 – …
Read More »Yearly Archives: 2025
భీమ్గల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
భీమ్గల్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయా మండలాలకు చెందిన 867 మందికి ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »కామారెడ్డి పశు కల్యాణ సమితి ఏర్పాటు
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా పశు కల్యాణ సమితిని బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సమితి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి పశువైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా …
Read More »డిగ్రీ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల
డిచ్పల్లి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రాక్టికల్/ ప్రాజెక్టు పరీక్షలను ఈనెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ పర్యవేక్షణలో నిర్వహించి వెంటనే మార్కులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే.సంపత్ కుమార్ తెలిపారు పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని సూచించారు.
Read More »అప్పుల భారం ఉన్నా … వాగ్దానాలను అమలు చేస్తున్నాం
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్షేపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు బుధవారం ఆర్మూర్ పట్టణంలోని …
Read More »సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, మీ లాంటి ఉమ్మడి కుటుంబాలను …
Read More »ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ప్రజా పాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సన్న బియ్యం పంపిణీ,తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని …
Read More »నేటి నుండి భూభారతి అవగాహన సదస్సులు…
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి (17.4.2025) నుండి ఈ నెల 30 వరకు జిల్లాలోని మండల కేంద్రాల్లో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన భూ భారతి కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. …
Read More »కామారెడ్డికి కొత్త నీటి ట్యాంకర్లు
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో నీటి సరఫరాకు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే 8 ట్యాంకర్ల ద్వారా ఈ వేసవి …
Read More »అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసుల నమోదు
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది …
Read More »