Yearly Archives: 2025

జడ్పిహెచ్‌ఎస్‌ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్‌ టూర్‌లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్‌ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్‌ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల …

Read More »

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

బాన్సువాడ, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ ఉద్యోగులు, ఓంశాంతి సభ్యులను, డిపో మేనేజర్‌ సరితా దేవిని బిజెపి నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో …

Read More »

లయన్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని లయన్స్‌ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్‌ ప్లాంట్‌ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మార్చి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.44 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 7.49 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.01 వరకుతదుపరి తైతుల రాత్రి 11.22 వరకు వర్జ్యం : ఉదయం 11.36 – 1.10దుర్ముహూర్తము : ఉదయం 6.17 …

Read More »

స్కూల్‌ యూనిఫాం కుట్టడానికి సిద్ధంగా ఉండాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే విద్యా సంవత్సరానికి స్కూల్‌ యూనిఫాం కుట్టడానికి మహిళలు అందరూ సిద్ధంగా ఉండాలని,అందుకై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్‌డివో సాయాగౌడ్‌ చెప్పారు. రెండు రోజులుగా స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మహిళా టైలర్‌లకు మార్గనిర్దేశం చేశారు. పోయినా సంవత్సరం మహిళలు విజయవంతంగా యూనిఫాం కుట్టించి సకాలంలో స్కూల్‌కు పంపిణీ …

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఇంటర్‌ బోర్డు స్క్వాడ్‌ బృందాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,649 మంది విద్యార్థులకు గాను17,997 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 96.5 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు …

Read More »

వజ్స్రోతవ వేడుకల్లో ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌

సదాశివనగర్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలంలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ (జడ్పిహెచ్‌ఎస్‌) కల్వారాల్‌ 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుక, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ పూర్వ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి అనుభవాలు పంచుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు …

Read More »

కామారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవం

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరచడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మార్చి 8 స అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మొట్టమొదట మార్చి …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జనార్ధన్‌, ఎన్నికల …

Read More »

ఇంటర్‌ ప్రథమలో 384 మంది గైర్హాజరు

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా, మాల్‌ ప్రాక్టీస్‌ జరుగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్‌ లలో పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన పరీక్షలో 9337 మంది విద్యార్థులకు గాను 8953 మంది విద్యార్థులు హాజరయ్యారని, 384 మంది విద్యార్థులు గైర్హాజరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »