ఆర్మూర్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారము ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ ఈ ఓ రవి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. …
Read More »Yearly Archives: 2025
నవోదయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయం వచ్చే విద్యా సంవత్సరానికి 9 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఎంట్రెన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »పోలింగ్ కేంద్రాలలో వసతులను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీంగల్, వేల్పూర్, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో …
Read More »ఈవీఎం గోడౌన్ను సందర్శించిన జిల్లా కలెక్టర్
కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాం ను సందర్శన చేసారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, గోదాములో భద్రపరచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును సి.సి.టివి ద్వారా తనిఖీ చేశారు. …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఫిబ్రవరి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 11.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.36 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 6.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.07 వరకుతదుపరి గరజి రాత్రి 11.09 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.01 – 2.32మరల రాత్రి 1.58 – …
Read More »హైకోర్టు న్యాయమూర్తికి విన్నపాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీని హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలుసుకుని పూలగుచ్ఛం అందజేసి రెండు పేజీల వినతిపత్రం అందజేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. సీనియర్ న్యాయమూర్తిగా తమ అనుభవంతో జిల్లాకోర్టులోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వివరించారు. …
Read More »ఆసుపత్రి ముందు కార్మికుల ధర్నా
బాన్సువాడ, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, కమర్ అలీ, రేణుక, సంతోష్ గౌడ్, సురేఖ, సంగీత, కళ్యాణి, గంగారం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Read More »వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, త్రాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, మొక్కలకు వాటరింగ్, భవన నిర్మాణ పనులకు అనుమతులు, ఇంజనీరింగ్ పనులు, తదితర అంశాలపై కలెక్టర్ …
Read More »రూ. 12 కోట్ల గంజాయి, నిషేదిత మత్తు మందుల కాల్చివేత..
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :.నిజామాబాద్, బోధన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన రూ. 12 కోట్ల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు. నిజామాబాద్ డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కే. మల్లారెడ్డి ఇతర యంత్రాంగం నిమాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ …
Read More »కోళ్ళ పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభలినందున జిల్లాలోని కోళ్ళ పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోళ్ళ రైతులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి కోళ్లలో వచ్చే వివిధ వ్యాధులు ముఖ్యంగా ఏవియన్ ఇన్ఫ్లుంజ్ గూర్చి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులను ఉద్దేశించి …
Read More »