కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

గాంధారి, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గాంధారి మండలం హేమ్లానాయక్‌ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. సదాశివనగర్‌ సిఐ రామన్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హేమ్లానాయక్‌ తండాకు చెందిన వివాహిత రాతలా రేఖ (37) కనిపించడం లేదని సోమవారం గాంధారి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలిపారు.

సోమ్లా నాయక్‌ తండాకు చెందిన రేఖకు హేమ్లానాయక్‌ తండాకు చెందిన రాతలా పంతులుతో 20 సంవత్సరాల కింద వివాహం జరిగింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పక్కనే గల సోమ్లానాయక్‌ తాండా శివారులోని చెరువులో మహిళా మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు రోజుల క్రితం అదృష్యమైన రేఖగా నిర్దారించారు.

గత కొద్దీ రోజులుగా మృతురాలి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సోమ్లానాయక్‌ తండాకు చెందిన మృతురాలి బంధువులు హేమ్లానాయక్‌ తండాలో గల ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. రేఖ మృతికి భర్త పంతులు నాయక్‌ కారణమని ఇంటిపై దాడికి దిగారు. అప్రమత్తమైన సిఐ రామన్‌, స్థానిక ఎస్‌ఐ సాయి రెడ్డి, తాడ్వాయి ఎస్‌ఐ ఆంజనేయులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తండాలో పోలీస్‌ బందోబస్త్‌ నిర్వహించారు.

Check Also

గల్ఫ్‌ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »