Breaking News

న్యాయవాదులకు అండగా ఉంటా…

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదులందరికీ అండగా ఉంటానని, ఎల్లప్పుడూ తమ అవసరాల కోసం సంప్రదించాలని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో గంప గోవర్ధన్‌ ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

న్యాయవాదుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం మరో ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదులు చూపిన ప్రతిభ ఆదర్శనీయమని పేర్కొన్నారు. న్యాయవాదుల అండతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఉందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ న్యాయవాదులకు అండగా నిలిచిన గంప గోవర్ధన్‌ భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారని ఆకాంక్షించారు.

కామారెడ్డి అభివృద్ధిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటులో వారి పాత్ర అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గంప గోవర్ధన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు కోన శ్రీకాంత్‌ గౌడ్‌, జోగులాంబ, గంగాధర్‌, సూర్య ప్రసాద్‌, సలీం, లతా రెడ్డి, షబానా బేగం, సీనియర్‌ న్యాయవాదులు రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, దామోదర్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు బోర్డు దామోదర్‌ రెడ్డి, పీపీ లు నంద రమేష్‌, నిమ్మ దామోదర్‌ రెడ్డి, లక్ష్మణరావు, అమృత రావు, మోహన్‌ రావు, రజినీకాంత్‌, దేవేందర్‌ గౌడ్‌, జెడ్‌పిటిసి నారాయణ, దేవరాజ్‌ గౌడ్‌, రాజ గోపాల్‌ గౌడ్‌, అత్తమామల శ్రీధర్‌, సలీం, సీనియర్‌ న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »