Breaking News

11 న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు వినాయకనగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.

అనంతరం 10 గంటలకు రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంకు ఆనుకుని ఉన్న న్యూ అంబెడ్కర్‌ భవన్‌లో జయంతి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. అధికారులు, అనధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై మహాత్మా ఫూలే జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Check Also

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »