నూతన జిఎస్‌టిని తొలగించాలి

నందిపేట్‌, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నందిపేట్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేసి బిజెపి ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌ మాట్లాడుతు నందిపేట మండల టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలపైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

పుట్టిన పసిబిడ్డ, తాగే పాల నుంచి స్కూలుకు వెళ్తే పుస్తకాలు రబ్బరు పెన్సిల్‌ షార్ప్నర్‌, దురదృష్ట వశాత్తు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలైతే ఆసుపత్రిలో జిఎస్టి, అదృష్టం బాగోలేక ఆసుపత్రిలో మరణిస్తే స్మశానంలో జీఎస్టీ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో అన్ని వస్తువుల పైన అది కడుపేదలు వాడే నిత్యవసరాలలో నిత్యవసర వస్తువులపైన విధించిన జిఎస్టి వెంటనే రద్దు చేయాలని దుయ్యబట్టారు.

మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి ఆగకపోతే ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని టిఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన హెచ్చరించారు. కార్యక్రమంలో నందిపేట్‌ మండల జడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, సీనియర్‌ నాయకులు బాలగంగాధర్‌, హైమద్‌ ఖాన్‌, బుడ్డ శివ, సోషల్‌ మీడియా ఇన్ఛార్జి చిన్నారెడ్డి, లక్కంపల్లి సాగర్‌, నందిపేట్‌ పట్టణ అధ్యక్షులు భాస్కర్‌, మైనార్టీ అధ్యక్షులు పాషా, యూత్‌ నాయకులు వినయ్‌, గాండ్ల సంతోష్‌, వినీత్‌, శేఖర్‌, విజయ్‌, రవి, వార్డు మెంబర్లు రఫీ ఖాన్‌, గంధం సాయిలు, టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 భీంగల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »