Breaking News

ఓర్వలేకనే ప్రత్యక్ష దాడులు

కామారెడ్డి, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న టిఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిజెవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను మద్దతును చూసి ఓర్వలేక అసహనంతో నిన్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కిరాయి గుండాలతో పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ దాడులు చేశారని దీనిని బిజెవైఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

ప్రజా స్వామ్యం ఏ రాజకీయ పార్టీకి అయిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్రలు చేసే హక్కు ఉందని అలా కాదు అని దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని తిరిగి దాడులు చేస్తామని అన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్న నయా నిజాం తెగించి కొట్లాడి ప్రజల తరఫున బీజేపీ నిలబడుతుందని అన్నారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను దౌర్జన్యాలకు దింపుతూ దొర అభద్రతను బయట పెట్టుకుంటున్నడని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న టిఆర్‌ఎస్‌ పాలన అంతమొందే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »