Breaking News

ఒకేరోజు 59 ఆపరేషన్లు… మంత్రి అభినందన

నిజామాబాద్‌, ఆగష్టు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్‌ సర్జరీ,ఆర్థోపెడిక్‌, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్‌ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు దీటుగా అన్ని రకాల అదునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. 59 ఆపరేషన్లు చేసి రికార్డు నెలకొల్పిన ఆయా విభాగాల అధిపతులను, డాక్టర్లను, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »