Breaking News

అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి సకాలంలో రక్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రక్తదాత బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను విడనాడాలని రక్తదానం చేయడం వల్ల రక్తదాతలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతమైన వ్యక్తులు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్‌ లేట్లను అందజేయవచ్చును అన్నారు.

ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సాయం అందజేయడం, పేదింటి ఆడపడుచుల వివాహాల కోసం పుస్తె మట్టలను అందజేయడం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అదేవిధంగా ఐవీఎఫ్‌ ఆధ్వర్యంలో సకాలంలో రక్తాన్ని అందజేస్తామని అన్నారు.

ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా మాట్లాడుతూ 67 వ సారి రక్తదానం చేసిన బాలును అభినందించారు. సమాజం పట్ల ఉన్న సేవా నిరతికి చేస్తున్న రక్తదాన, సామాజిక సేవా కార్యక్రమాలు నిదర్శనమని యువత బాలును ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో కె.వి.సి బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది జీవన్‌, సతీష్‌, రమేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »